అక్రమాస్తుల కేసులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బెయిల్ రద్దుకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం నిరాకరించింది. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దుకూ సీబీఐ కోర్టు నిరాకరించింది.
ఈ కేసుకు సంబంధించి ప్రత్యక్షంగా, పరోక్షంగా సాక్షులను ప్రభావితం చేస్తున్నారనే ఆరోపణలతో సీఎం జగన్, వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిల బెయిల్ రద్దు చేయాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారు.
ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం రఘురామ పిటిషన్ను కొట్టేసింది. సీబీఐ కోర్టు తీర్పుపై పైకోర్టుకు వెళ్తానని ఎంపీ రఘురామరాజు తెలిపారు.