ఓ ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి నడి రోడ్డు మీద ప్రజాప్రతినిధుల్ని దూషించడం, విధి నిర్వహణలో ఉన్న పోలీసులను తిట్టడం, ఒక కానిస్టేబుల్ మొబైల్ ను కింద పడేయడం లాంటి పనులు చేసిన డాక్టర్ సుధాకర్ పై కూడా సీబీఐ కేసు నమోదు చేసింది.
23మంది సాక్షుల సమాచారంతో పాటు 130 పేజీలతో కూడిన సీడీ ఫైల్ ను సీబీఐకి ఫోర్త్ టౌన్ పోలీసులు అందచేశారు. దాంతో లాక్ డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించినందుకు డాక్టర్ సుధాకర్ పై సెక్షన్ 188 నమోదు చేశారు. న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ స్థానికులను భయబ్రాంతులకు గురిచేసారన్నది పోలీసుల ఆరోపణ.