ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో 12 వ రోజు సిబిఐ దర్యాప్తు కొనసాగుతున్నది. నిన్న ఏడు గంటల పాటు సిబిఐ అధికారులు వివేకానందరెడ్డి కుమార్తె సునీతను విచారించిన విషయం తెలిసిందే.
తన దగ్గరున్న ఆధారాలను సిబిఐ అధికారులకు సునీత అప్పగించారు. వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శంకర్ రెడ్డి నేడు విచారణకు హాజరయ్యారు. అదే విధంగా మరికొందరిని విచారించే అవకాశం కూడా ఉంది.