ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి వైఎస్ వివేకానంద హత్య కేసులో సీబీఐ రెండో విడత విచారణ ప్రారంభించింది. అంతకు ముందు జులైలో 2 వారాలపాటు పులివెందుల, కడపలో విచారణ చేసింది. ఇప్పటికే ఆయన ఇంట్లో కేసుకు సంబంధించి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన అధికారులు కీలక వ్యక్తులను విచారించారు.
జులై 31న కడప నుంచి దిల్లీ వెళ్లిపోయారు. 40 రోజుల తర్వాత సీబీఐ అధికారులు రాష్ట్రానికి చేరుకున్నారు. ఇవాళ మళ్లీ పులివెందుల అతిథిగృహంలో కేసు వివరాలపై ఆరా తీశారు.