30.7 C
Hyderabad
April 19, 2024 10: 11 AM
Slider పశ్చిమగోదావరి

బీజేపీ నాయకుడి ఇంటిపై కొనసాగుతున్న సీబీఐ దాడులు

#AmbikaKrishna

ప్రధాన మంత్రిని కలిసి వస్తే సీబీఐ కేసులు మాఫీ అయిపోతాయని కమ్యూనిస్టు పార్టీ నాయకులు చెబుతూ ఉంటారు. అలా చెబుతూ అటు ప్రధానిని ఇటు ఆయనను కలిసి వచ్చిన వారిని కూడా అవమానిస్తూ ఉంటారు.

అయితే విచిత్రంగా బీజేపీ నాయకుడిపైనే సీబీఐ దాడులు జరిగాయి. అది కూడా ఎక్కడో కాదు ఆంధ్రప్రదేశ్ లోనే. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని అంబికా సంస్థలపై సీబీఐ సోదాలు జరుపుతోంది.

ఆ సంస్థలతో పాటు కుటుంబ సభ్యుల ఇళ్ళలోనూ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇదే అంబికా సంస్థలకు సంబంధించి వేర్వేరు పేర్లతో లోన్లు సేకరించారన్న నేపథ్యంలో అధికారులు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు.

మరోవైపు అంబికా సంస్థల అధినేత అంబికా కృష్ణ గృహంలో సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి. గతంలో ఏలూరు పవర్ పేట స్టేట్ బ్యాంకులో కూడా సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు.

అంబికా కృష్ణ తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్లిపోయి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే కదా.

Related posts

రక్త నిల్వలు నిండుకున్నాయి.. రక్తదానానికి ముందుకు రండి..

Satyam NEWS

బీజేపీలోకి గౌతమ్ సవాంగ్?

Satyam NEWS

గాలి ద్వారా కూడా కరోనా వైరస్ సోకే అవకాశం

Satyam NEWS

Leave a Comment