31.2 C
Hyderabad
April 19, 2024 05: 39 AM
Slider ప్రత్యేకం

నర్సాపురం ఎంపి రఘురామకృష్ణంరాజుపై సీబీఐ దాడులు

#MPRaghuramakrishnamRaju

సంచలనాల కేంద్ర బిందువు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు ఇంటిపై సీబీఐ దాడి చేసింది.

హైదరాబాద్ లోని ఆయన ఇంటిలోనూ, ఆయనకు చెందిన ఇందు భారత్ ఇన్ ఫ్రా కంపెనీ కి చెందిన కార్యాలయాలలోనూ ఏకకాలంలో సీబీఐ రైడ్ చేసింది.

ఢిల్లీ నుండి వచ్చిన సీబిఐ ప్రత్యేక బృందాలు హైదరాబాదు లో ఇందు భారత్  కంపెనీ తో సహా ఎనిమిది కంపెనీలకు చెందిన డైరెక్టర్ ల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నాయి.

ఉదయం ఆరు గంటల నుండి సోదాలు కొనసాగుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై ఇటీవల రఘురామకృష్ణంరాజు తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు తీవ్రమైన తలనొప్పులు తెచ్చిపెడుతున్న రఘురామకృష్ణం రాజు కంపెనీలపై సీబీఐ దాడులు జరగడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

Related posts

పబ్లిక్ విజిల్: నెల్లూరులో బాలికపై అత్యాచార యత్నం

Satyam NEWS

ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్ కు రైల్వే లైన్ కావాలి

Satyam NEWS

డియస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు

Satyam NEWS

Leave a Comment