సంచలనాల కేంద్ర బిందువు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు ఇంటిపై సీబీఐ దాడి చేసింది.
హైదరాబాద్ లోని ఆయన ఇంటిలోనూ, ఆయనకు చెందిన ఇందు భారత్ ఇన్ ఫ్రా కంపెనీ కి చెందిన కార్యాలయాలలోనూ ఏకకాలంలో సీబీఐ రైడ్ చేసింది.
ఢిల్లీ నుండి వచ్చిన సీబిఐ ప్రత్యేక బృందాలు హైదరాబాదు లో ఇందు భారత్ కంపెనీ తో సహా ఎనిమిది కంపెనీలకు చెందిన డైరెక్టర్ ల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నాయి.
ఉదయం ఆరు గంటల నుండి సోదాలు కొనసాగుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై ఇటీవల రఘురామకృష్ణంరాజు తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు తీవ్రమైన తలనొప్పులు తెచ్చిపెడుతున్న రఘురామకృష్ణం రాజు కంపెనీలపై సీబీఐ దాడులు జరగడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.