మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 71 వ జన్మదినం సందర్భంగా నందమూరి వీరాభిమాని, తెలుగుదేశం నాయకులు పాలగిరి ఖాజా ఆధ్వర్యంలో కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణలోని 26 వ వార్డులోని 1000 కుటుంబాలకు చీనిపండ్లు, ద్రాక్షపండ్లు, జామపండ్లు పంచారు.
అలాగే ఆటోలో టపాసులు పేలి గాయపడిన మన నందమూరి వీరాభిమాని మల్లికార్జున కుటుంబానికి రెండు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ నందమూరి యువ సేవా సమితి తరపున గోమేధికమ్ సుదర్శన్, సిజె.వెంకటసుబ్బయ్య, సింహా చంద్రశేఖర్ యాదవ్ , సూరి కాసారపు, CBN ఆర్మీ తరపున శ్రీను, హర్ష, ప్రవీణ్ లు పాల్గొన్నారు.