35.2 C
Hyderabad
April 24, 2024 11: 35 AM
Slider రంగారెడ్డి

మల్లాపూర్ డివిజన్ లో సీసీ కెమెరాల ఏర్పాటు

#mallapurdivision

సురక్షితమైన సమాజమే  లక్ష్యంగా, నేరాలు అదుపు చేయడంలో భాగంగా హైదరాబాద్ శివారులోని మల్లాపూర్ డివిజన్ బ్యాంకు కాలనీ లో  సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా సోమవారం నాచారం  పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్ బ్యాంకు కాలనీ ప్రజలు స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలను అసిస్టెంట్  కమిషనర్ శ్యామ్ ప్రసాద్ , ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి , సిఐ కిరణ్ కుమార్ , స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా శ్యామ్ ప్రసాద్, కిరణ్  మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ కోసం మల్కాజ్గిరి డివిజన్ లోని నాచారం PS ప్రత్యేక దృష్టిని సారించిందని అందులో భాగంగా  అభివృద్ధి దిశగా పయనిస్తున్న ప్రస్తుత తరుణంలో రక్షణ కోసం  ప్రధాన సంపత్తిగా మారిన సీసీ కెమెరాలతో ఒక పక్క నేరాలను అదుపు చేయడం.. మరో పక్క నేరాలు జరగకుండా అడ్డుకోవడంలో తమ వంతు పాత్రను పోషిస్తూ.. ప్రజల భద్రతా ప్రమాణాలు మరింత మెరుగు పరిచేందుకు సీసీ కెమెరాలు దోహదపడుతున్నాయని అన్నారు.

కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ నేరస్థులు కూడా కొత్త తరహా  పద్ధతులను ఎంచుకుని నేరాలు చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో నిర్విరామంగా పనిచేసే సీసీ కెమెరాలతో  మీ ప్రాంతాలలో అపరిచిత వ్యక్తుల కదలికలు, అసాంఘిక కార్యకలాపాలు, ఏ చిన్న నేర సంఘటన జరిగిన గుర్తించడానికి  దోహదపడుతుందన్నారు.

కార్యక్రమంలో బ్యాంకు కాలనీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు సూర్ణము రాజేష్ , రవి కుమార్ యాదవ్ , శివ శంకర్ , మన్నెం , హరి బాబు , వెంకటేశ్వర్ రావు , అంజయ్య , రవి శంకర్ , సురేందర్ , కనకయ్య , శ్రీనివాస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఆడపిల్లలకు అప్స ఫౌండేషన్ ఎడ్యుకేషన్ కిట్ పంపిణీ

Satyam NEWS

రెయిన్ డే: ముందస్తు జాగ్రత్తలకు ప్రజలు సిద్ధం కావాలి

Satyam NEWS

ఆర్యన్‌ డ్రగ్స్ కేసు నుంచి సమీర్ వాంఖెడే అవుట్‌

Sub Editor

Leave a Comment