అంబర్ పేట డివిజన్ పటేల్ బాడాలో 18 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ తో కలిసి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డీసీ వేణుగోపాల్, డీఈ సంతోష్, ఏఈ శ్వేత, వర్క్ ఇన్స్పెక్టర్ దుర్గా, కాంట్రాక్టర్ అబ్రార్, పలువురు నాయకులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.