39.2 C
Hyderabad
March 29, 2024 13: 37 PM
Slider ప్రత్యేకం

ప్రజాఉపయోగానికి ఖర్చు చేయాల్సిన నిధులు చర్చికి ఇస్తారా?

#Raghuramakrishnamraju

ప్రజా ఉపయోగ కార్యక్రమాలకు ఖర్చు చేయాల్సిన ఎంపీ లాడ్స్ నిధులను ఒక చర్చికి ఖర్చు చేసిన విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. దాంతో ఎంపీ లాడ్స్‌ నిధులను మత సంబంధ భవనాలకు కేటాయించడంపై ఏపీని కేంద్ర ప్రభుత్వం వివరణ కోరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళిక విభాగం ముఖ్యకార్యదర్శికి కేంద్రం లేఖ రాసింది. బాపట్లలో చర్చికి రూ.86 లక్షల ఎంపీ లాడ్స్‌ నిధులు ఖర్చు చేశారని.. చాలా చోట్ల ఇదే తరహాలో నిధులు వినియోగించారని ఎంపీ రఘురామ కేంద్రానికి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పీఎంవో కార్యాలయం.. ఏపీ ప్రభుత్వం వివరణ కోరాల్సిందిగా సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖకు ఆదేశాలిచ్చింది. దీంతో ఎంపీ లాడ్స్‌ నిధులపై వాస్తవ నివేదికతో పాటు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఏపీని కేంద్రం వివరణ కోరింది.

Related posts

జుక్కల్ లో ఘనంగా యువనేత జన్మదిన వేడుకలు

Satyam NEWS

గృహలక్ష్మి పథకం గడువు ఆగస్ట్‌ 31 వరకు పొడిగించాలి

Bhavani

అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యతిరేకుల పైన రాజద్రోహం కేసు పెట్టాలి

Satyam NEWS

Leave a Comment