39.2 C
Hyderabad
March 29, 2024 13: 30 PM
Slider ముఖ్యంశాలు

సెంట్రింగ్‌ కాంట్రాక్టర్ల వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గం

#enteringworkers

కాప్రా జోన్‌ సెంట్రింగ్‌ కాంట్రాక్టర్స్‌ వేల్ఫేర్‌ అసోసియేషన్‌  నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్యఅతిధులుగా చర్లపల్లి డివిజన్‌ కార్పోరేటర్‌ బొంతు శ్రీదేవిరామ్మోహన్‌, టిపిసిసి కార్యదర్శిసింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి, ఎన్నికల అధికారి ఎమ్‌.ఎస్‌.చారి పాల్గొని నూతన కమిటీని ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్బంగా అధ్యక్ష కార్యదర్శిలు బిక్షపతివంశరాజ్‌, కనకరాజ్‌గౌడ్‌ లు మాట్లాడుతూ కార్మిక హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉధ్యమించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 

ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాత కమిటికి వీడ్కోలు పలికి కొత్త కమిటిని ఆహ్వానించి ప్రమాణ స్వీకారం చేయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం  ఆదివారం కాప్రాలో పద్మశాలి టౌన్‌షిప్‌లోని సెంట్రింగ్‌ కాట్రాక్టర్స్‌ వెల్ఫేర్‌ భవన్‌లో జరిగింది.  సెంట్రింగ్‌ కాంట్రాక్టర్స్‌ వేల్ఫేర్‌ నూతన అసోసియేషన్‌ అధ్యక్షునిగా శ్యామల బిక్షపతివంశరాజ్‌, ప్రధాన కార్యదర్శిగా బి.కనకరాజ్‌గౌడ్‌, కోశాధికారిగా బాల్దె శ్రీశైలం ఎన్నికయ్యారు.

ఈ మేరకు సెట్రల్‌ కమిటి  కృష్ణ, యాదగిరి, విష్ణువర్ధన్‌రెడ్డి, పాషా నాయకుల పర్యవేక్షణలో జరిగింది. కార్యక్రమంలో  ఉపాధ్యక్షులు కళ్ళెం రాము, సంయుక్త కార్యదర్శి గాలిగళ్ళ పాండు, సహాయకార్యదర్శి మచ్చగిరి వంంశరాజ్‌, కందాడి భాస్కర్‌రెడ్డి, ఈర్ల రవికుమార్‌, ప్రచార కార్యదర్శిలు బోళ్ళ కనకయ్య, పగడాల బాలస్వామి, దశరధ, రమేష్‌, పోచయ్య, నర్సింహారావు జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓ భిక్షపతిరావు, ఎస్‌ఐ సాయిలు, మోకు నర్సింహరెడ్డి, దొడ్డి నర్సింగరావు, పోచయ్య, రఘుపతిరెడ్డి, తదితరలు పాల్గొన్నారు.

Related posts

మాస్కులు, గ్లౌజులు తప్పని సరిగా ధరించాలి

Satyam NEWS

ఆంధ్రప్రదేశ్ లో సినిమా షూటింగ్ లకు ఆహ్వానం

Satyam NEWS

పల్నాడు ప్రాంత అభివృద్ధికి కీలక ముందడుగు

Satyam NEWS

Leave a Comment