కొత్త సంవత్సరం మొదటి తేదీన ఎల్పీబీ సిలిండర్ ధరపై షాకింగ్ నిర్ణయం తీసుకోనున్నారు. ఎల్పీజీ సిలిండర్ ధరపై ప్రతి నెలా ఒకటో తేదీన సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సమావేశంలో ఎల్పీజీ సిలిండర్ ధర పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు స్వల్పంగా పెరగడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. అయితే, వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్, పంజాబ్ సహా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మోడీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ వంటి గ్యాస్ను చౌకగా మారుస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.