రోజు రోజుకూ కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు పెరిగిపోతుండటంతో కేంద్ర ఆరోగ్య శాఖ కు చెందిన బృందాలు పరిశీలనకు వచ్చాయి. నలుగురు సభ్యుల కేంద్ర బృందం హైదరాబాద్ లోని పలు ప్రాంతాలను సందర్శించి క్షేత్ర స్థాయి అంచనాలను తయారు చేస్తున్నది. ముందుగా కేంద్ర బృందం గచ్చిబౌలిలోని టిమ్స్ను సందర్శించింది. కోవిడ్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకుంటామని కేంద్ర బృందం ప్రకటించింది. మూడు రోజులు రాష్ట్రంలో పర్యటిస్తామని పేర్కొంది. తమ పర్యటన తర్వాత పూర్తి నివేదికను కేంద్రానికి అందిస్తామని ప్రకటించింది. నేడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్తోర కూడా బృందం సభ్యులు సమావేశం అవుతారు.
previous post