బిచ్కుంద మండల కేంద్రంలోని శ్రీ గణేష్ తాపీ మేస్ర్తి ల సంఘం ఆధ్వర్యంలో న్యాక్ ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమం పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు నమిలి మెట్ సాయిలు మాట్లాడుతూ 21 మంది మేస్త్రీలు ఈ శిక్షణ శిబిరానికి పదిహేను రోజుల పాటు వెళ్లారని తెలిపారు.
శిక్షణ అనంతరం నాక్ సంస్థ కార్మిక శాఖ ఆధ్వర్యంలో శిక్షణ ధ్రువీకరణ పత్రాలు పంపిణీకి అందజేయగా ఆదివారం నాడు వాటిని సంబంధిత మేస్త్రీలకు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సాయిలుతో పాటు ఉపాధ్యక్షులు మల్లు గాని భూమయ్య ,కార్యదర్శి వాజిద్, క్యాషియర్ రొయ్యల పండరి, సలహాదారులు రామయ్య మేస్త్రీ ,మోతిరాం ,సతీష్, కె శ్రీను ,బంటు శ్రీనివాస్, కె సాయిలు ఉన్నారు.