జాతీయ కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా వై. సునీల్ రెడ్డి ని నియమించినట్లు కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు వైభవ్ తివారి, ఉపాధ్యక్షులు సౌరబ్ సక్సేనా, ప్రధాన కార్యదర్శి అలోక్ దీక్షిత్, జాయింట్ సెక్రటరీ వినయ్ కుష్వాల్ తెలిపారు.
ఈ మేరకు ఆయన కు నియామక పత్రాన్ని అందజేశారు. విద్యా రంగం లో విస్తృత పరిచయాలున్న సునీల్ రెడ్డి ని ఈ పదవి కి ఎంపిక చేశామన్నారు.
ఐఐటీ రూర్కీ లో పీజీ కెమిస్ట్రీ పూర్తి చేసిన సునీల్ రెడ్డి ప్రస్తుతం ఆల్ వింగ్స్ ఐఐటీ అకాడమీ లో డైరెక్టర్ విధులు నిర్వహిస్తున్నారు.