స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనపై టీడీపీ నేత, నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ప్రమాదంలో పది మంది వరకూ మృతి చెందడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. క్వారంటైన్ సెంటర్లో అగ్ని ప్రమాదం బాధాకరమన్నారు. క్షతగాత్రులకు అత్యున్నత వైద్యం అందించాలని పేర్కొన్నారు.
మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.