తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడుని ఆ పార్టీ నాయకులు గురువారం నరసరావుపేట మండలం కేసానుపల్లి గ్రామం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. అమరావతి నుంచి మాచర్ల కి రోడ్డు మార్గంలో బయలుదేరిన నారా చంద్రబాబు నాయుడికి నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు ఆధ్వర్యంలో కేసానుపల్లి గ్రామం వద్ద ఘన స్వాగతం పలికారు. జై చంద్రబాబు జై జై చంద్రబాబు జై చదలవాడ జైజై చదలవాడ అంటూ పెద్ద ఎత్తున అభిమానులు నినాదాలు చేశారు. అనంతరం డా౹౹చదలవాడ ,నియోజకవర్గ నాయకులతో కలిసి అధినేత నారా చంద్రబాబుతో మాచర్ల కి పయనమయ్యారు.
next post