ప్రపంచాన్నిగడగడా లాడిస్తున్నప్రమాదకర కరోనా వైరస్ ఇప్పుడు చైనాను వణికిస్తోంది. దేశం లో వైరస్ వ్యాపించ కుండా అన్ని చర్యలు తీసుకుంటుంది చైనా. వ్యాప్తికి ప్రధాన కారణమైన మాంసం ఉట్పత్తులను ,కొన్ని జంతువుల అమ్మకాలను ఆపేయాలని కోరింది.దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మార్కెట్లు, సూపర్ మార్కెట్లు, రెస్టారెంట్లు, ఈ-కామర్స్ సైట్లు తదితర వాటిలో జంతువులు, వాటి మాంసం అమ్మకాలను నిషేధించింది. ఈ మేరకు వ్యవసాయ మంత్రిత్వ శాఖ, అటవీ బ్యూరో సంయుక్త ప్రకటనలో ఈ విషయాన్నీపేర్కొన్నాయి ప్రపంచవ్యాప్తంగా 2,000 మంది ఈ వైరస్ బారినపడగా, చైనాలో ఇప్పటి వరకు 56 మంది ప్రాణాలు కోల్పోయారు.