కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ నేపధ్యం లో పేద వర్గాల ప్రజలకు చైతన్య ఫౌండేషన్ గత రెండు నెలలుగా తన వంతు సహాయ సహకారాలను అందిస్తున్నది. అందులో భాగంగా నేడు సికిందరాబాద్ లోని దేవనార్ అంద పాఠశాల లోని సుమారు 150 విద్యార్థులకు ఒక నెలకు సరిపోను 300 కేజీల బియ్యం,100 కేజీ ల కందిపప్పు,45 కేజీ ల ఆయిల్, 50 కేజీ ల షుగర్ అందచేశారు.
మానవతా దృక్పథంతో తమ సంస్థ ఈ చిరు సహాయాన్ని అందజేసినట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం లో ఎం.నర్సింహారావు, ఎన్.వీరయ్య, ఎం.గణపతిరావు, విద్యాచంద్రమోహన్, తెలంగాణ ఆర్య వైశ్య మహాసభ పోలిటికల్ మీడియా చైర్మన్ సంజయ్ విడియాల మేఘా తదితరులు పాల్గొన్నారు.