ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్స్ ఎస్పీగా కె.చక్రవర్తి బాధ్యతలు చేపట్టారు. ఏలూరు ఏఎస్పీగా ఉండగా పదోన్నతి మీద టాస్క్ ఫోర్స్ ఎస్పీగా బదిలీపై వచ్చారు. ఛార్జ్ తీసుకుని మాట్లాడుతూ టాస్క్ ఫోర్స్ ఎస్పీగా ఎర్రచందనం పరిరక్షణకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. శేషాశలం అడవులు నుంచి అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకుంటానని అన్నారు. స్మగ్లర్లను ఉక్కుపాదంతో అణచి వేస్తామని అన్నారు.దీనికి ప్రత్యేక వ్యూహాలను,ఇతర అధికారులతో కలసి రూపొందిస్తామని తెలిపారు. తరువాత టాస్క్ ఫోర్స్ ఆర్ఐ,సీఐ,ఎస్ఐ తదితర అధికారులతో సమావేశమయ్యారు.
previous post