32.7 C
Hyderabad
March 29, 2024 12: 26 PM
Slider వరంగల్

రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ్ కు ఎంపికైన చల్వాయి ఉన్నత పాఠశాల విద్యార్థి


రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ్ పోటీలకు ఎంపికైన ములుగు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థి పెండెల విజయ్ ను పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు. నిన్న ములుగు జిల్లా కేంద్రంలో జిల్లా విద్యాశాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కళా ఉత్సవ్ లో పాల్గొని పిట్టలదొర ఏకపాత్రాభినయం ప్రదర్శించిన పెండెల విజయ్ జిల్లా స్థాయిలో “సోలో డ్రామా”అంశంలో మొదటి స్థానం పొందాడు. దీనితో అతను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పాఠశాల ఉపాధ్యాయులు విజయ్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మొలుగూరి రమేష్, ఉప్పుతల ప్రసాద్, దామరాజు సమ్మయ్య, చల్లగురుగుల మల్లయ్య,బూత్కూరి శ్యామ్ సుందర్ రెడ్డి,అందె రమాదేవి,భూక్య సరిత,సుతారి మురళీధర్, ముడుంబ వెంకట రమణమూర్తి,రాయబారపు దీప్తి, కొత్త వెంకటేశ్ పాల్గొన్నారు.

Related posts

ఆకట్టుకుంటున్న అక్కినేని నాగచైతన్య “థ్యాంక్యూ” టీజర్

Satyam NEWS

శిల్ప కళ బిల్లింగ్ వర్కర్స్ యూనియన్ నూతన అధ్యక్ష ఎన్నిక

Satyam NEWS

బదిలీలకు మ్యాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలి

Satyam NEWS

Leave a Comment