చంబల్గ్యాంగ్కు చెందిన ముగ్గురు సభ్యులను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లోగల ఓ వ్యాపారి ఇంట్లో గతనెల 8వ తేదీన భారీ చోరీ జరిగింది. వ్యాపారి ఇంట్లో పనిచేస్తున్న వారు సుమారు రూ. 3 కోట్ల విలువ చేసే బంగారు, వజ్రాభరణాలు, నగదు చోరీ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చోరీ చేసింది బిహార్కు చెందిన చంబల్ గ్యాంగ్ అని నిర్ధారణ అయింది. డీఐ రవికుమార్, డీఎ్సఐ భరత్భూషణ్ ప్రత్యేక బృందం బిహార్ వెళ్లింది. పదిరోజులపాటు అక్కడే మకాం వేసి నిందితుల కోసం గాలించారు. చోరీతో సంబంధం ఉన్న బోలా, హరిశ్చంద్ర, భగవత్ను అరెస్టు చేశారు. మరో నిందితుడు రామాశిష్ పరారీలో ఉన్నాడు. సూత్రధారుడు రాహుల్ కోసం గాలిస్తున్నారు. ప్రధాన నిందితుడు పట్టుబడితే చోరీ అయిన సొత్తు రికవరీ అవుతుందని అంటున్నారు.
previous post