ప్రసిద్ధ పుణ్య క్షేత్రం సింహాచలం లో రేపు చందనోత్సవం జరగనున్నది.అప్పన్నస్వామి నిజరూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. నిజరూప దర్శనానికి రెండు లక్షలు మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. సామాన్య భక్తుల దర్శనానికి అధిక ప్రాధాన్యతిస్తూ ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్వామివారికి పట్టు వస్త్రాలను రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సమర్పిస్తారు. టీటీడీ చైర్మన్ బి ఆర్ నాయుడు తిరుమల శ్రీవారి నుంచి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. చందనోత్సవానికి రెండు వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
previous post
next post