39.2 C
Hyderabad
March 29, 2024 16: 14 PM
Slider విజయనగరం

భ‌వానీ మాలధారులు బెజ‌వాడ‌కు వెళ్ల‌కుండానే “అమ్మ”‌ ద‌ర్శ‌నం

#BhavaniMala

లోక కళ్యాణం కోసం చేస్తున్న చండీ హోమం ప్రజలందరికీ మేలు జరగాలని వైఎస్ఆర్సీపీ  మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి అన్నారు.

హెల్పింగ్ హాండ్స్ హిజ్రాస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న‌గ‌రంలోని  పెద్ద చెరువు ఒడ్డున శ్రీ శ్రీ శ్రీ శ్రీ విజయ సాగర దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో చండీ హోమం లో ఆమె పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు ఆమెకు సాదర స్వాగతం పలికారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య అమ్మవారికి ఆమె ప్రత్యేక పూజలు చేయ‌గా…. ఆమె పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమ్మ ఆది పరాశక్తి అని, చండీమాత ప్రచండ శక్తీ  అని అన్నారు. సృష్టి జరగడానికి, అభివృద్ధి చెందడానికి అవసరమైన శక్తి ఆమెలో ఉంటుందన్నారు. 

కరోనా పరిస్థితుల నేపథ్యంలో భవాని మాలధారులు ఇంద్రకీలాద్రికి వెళ్లడానికి ఇబ్బందులు పడకుండా ఇరుముడులు ఇక్కడ ఇచ్చే విధంగా, చండీ హోమం నిర్వ‌హించ‌డం వల్ల భక్తులకు మరింత ఆనందాన్ని కలిగిస్తోందన్నారు.

శ్రీ చైతన్య శ్రవణా నంద స్వామి కూడా పాల్గొని చండీ హోమం విశిష్టత వివరించారు. ఈ కార్యక్రమంలో తోటన్న  రెడ్డి, అసోసియేషన్ ప్రతినిధులు కొండబాబు, మీనా, స్రవంతి  తో పాటు దుర్గమ్మ భక్తులు పాల్గొన్నారు.

Related posts

వార్నింగ్:అంతర్గత వ్యవహారాల్లో టర్కీ జోక్యం తగదు

Satyam NEWS

ప్రకృతి ఒడిన పరవశించిన వేళ

Satyam NEWS

క్రైమ్ స్టోరీ: మందు పోయిస్తావా చంపమంటావా?

Satyam NEWS

Leave a Comment