స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైసీపీ నేతలు చట్టాలను ఉల్లంఘిస్తున్నారని ప్రతిపక్షనాయకుడు ఎన్.చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఒకప్పుడు తప్పుచేయాలంటే అధికారులు భయపడేవారని, అయితే ఇప్పుడు మాత్రం వైసీపీ నేతలను వెనకేసుకుని వస్తున్నారని ఆయన అన్నారు. వైసీపీ నేతలు ఎన్నికల కోడ్ను ఇష్టానుసారం ఉల్లంఘిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.
కుల, నో డ్యూస్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, కావాలనే టీడీపీ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అభ్యర్థులపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆయన విమర్శించారు. టీడీపీ అభ్యర్థి వద్ద పత్రాలు లాక్కెళ్తున్నా పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర వహించారని చంద్రబాబు ఆరోపించారు. 180 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయలేకపోయారని, టీడీపీ అభ్యర్థుల్ని పోలీసులు కూడా వేధించారని చంద్రబాబు అన్నారు.