ముఖ్యమంత్రి పేపర్ లీక్ చేస్తే జీఎన్ రావు పరీక్ష రాసినట్లుంది – అంటూ వ్యాఖ్యానించారు మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు. జీఎన్ నివేదిక అంటే అది జగన్ నివేదిక తప్ప మరొకటి కాదని ఆయన అన్నారు. తుళ్లూరు మహాధర్నా లో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అసెంబ్లీ ఓ దగ్గర, సచివాలయం మరో ప్రాంతంలో ప్రపంచంలో ఎక్కడా లేదు. నాపై కోపంతో ప్రజల్ని హింసించడం తగదు అని ఆయన అన్నారు.
నాడు చంద్రబాబు గా హామీ ఇవ్వలేదు….ప్రభుత్వం నుంచి సీఎం గా హామీ ఇచ్చాను. ఎకరం భూమి ఇవ్వడానికి ముందుకు రాని పతిస్థితుల్లో….33 వేల ఎకరాలు ఇచ్చారు. ఒక్క ఇల్లు కట్టాలంటే మూడేళ్లు పడుతుంది. అలాంటిది కట్టిన రాజధానిని తీసేస్తున్నారని చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.