35.2 C
Hyderabad
April 24, 2024 11: 12 AM
Slider ప్రత్యేకం

రజనీకాంత్ పై వైసీపీ నీచపు వ్యాఖ్యలు

#chandrababu

అన్నగారి శత జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆయనతో తన అనుబంధాన్ని…అనుభవాలను పంచుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ పై వైసీపీ మూకల అసభ్యకర విమర్శల దాడి అభ్యంతరకరం, దారుణం అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. శత జయంతి కార్యక్రమంలో పాల్గొన్న రజనీకాంత్ జగన్ ప్రభుత్వం పై ఏ మాత్రం చిన్న విమర్శ కూడా చేయలేదు. ఆయన రాజకీయాలు కూడా మాట్లాడలేదు.

అయినా సరే ఆయనపై వైసీపీ నీచపు వ్యాఖ్యలు చేస్తున్నది. సమాజంలో ఎంతో గౌరవం ఉండే రజనీ కాంత్ లాంటి లెజెండరీ పర్సనాలటీపై కూడా వైసీపీ నేతలు చేస్తున్న నీచ వ్యాఖ్యలు అందరికీ బాధ కలిగిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వ పోకడలపై ఆయన చిన్న విమర్శ చేయలేదు…ఎవరినీ చిన్న మాట అనలేదు. పలు అంశాలపై కేవలం తన అభిప్రాయాలు పంచుకున్నారు. అయినా తీవ్ర అహంకారంతో ఆయనపై చేస్తున్న ఆర్థం లేని విమర్శలను తెలుగు ప్రజలు ఎవరూ సహించరు. శిఖరం లాంటి వ్యక్తిత్వం కలిగిన రజనీ క్యారెక్టర్ పై మీ పార్టీ నేతల విమర్శలు ఆకాశం పై ఉమ్మి వేయడమే. నోటిదూల నేతలను జగన్ అదుపులో పెట్టుకోవాలి….జరిగిన దానికి క్షమాపణ చెప్పి తమ తప్పు సరిదిద్దుకోవాలి అని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Related posts

ఈ ఆఫిస్ ద్వారా ఫైళ్ళ నిర్వహణ

Bhavani

ఆర్యన్‌ డ్రగ్స్ కేసు నుంచి సమీర్ వాంఖెడే అవుట్‌

Sub Editor

ఎన్నికల కమిషనర్ విధినిర్వహణకు కిరికిరి పెట్టవద్దు

Satyam NEWS

Leave a Comment