నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు సభలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 8 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై తెలుగుదేశం పార్టీ మొత్తం స్పందిస్తున్నది. పార్టీ పరంగా మృతుల కుటుంబాలకు చంద్రబాబునాయుడు సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. అదే విధంగా చనిపోయిన వారి కుటుంబంలో చదువుకునే పిల్లలు ఉంటే వారికి ఎన్టీఆర్ ట్రస్టు తరపున ఉచిత విద్య అందిస్తామని కూడా చంద్రబాబు ప్రకటించారు. కందుకూరు ప్రమాద మృతుల కుటుంబాలకు టీడీపీ నుంచి, పార్టీ నేతల నుంచి కలిపి రూ.24 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నారు.
1.తెలుగు దేశం పార్టీ ఆర్థిక సాయం రూ.15,00,000/-
2.ఇంటూరి నాగేశ్వర్ రావు రూ. 1 లక్ష
3. ఇంటూరి రాజేష్ రూ.1 లక్ష
4.శిష్ట్లా లోహిత్ రూ. 1 లక్ష
5.బేబీ నాయన రూ.50,000
6.కేశినేని చిన్ని రూ.50,000
7.కంచర్ల సుధాకర్ రూ.2 లక్షలు
8.కంచర్ల శ్రీకాంత్ రూ. 1 లక్ష
9.అబ్దుల్ అజీజ్ రూ.50,000
10 పోతుల రామారావు రూ.50,000
11.పొడపాటి సుధాకర్ రూ.50,000
మృతుల కుటుంబాలను నేడు చంద్రబాబునాయుడు పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు.