28.7 C
Hyderabad
April 25, 2024 06: 49 AM
Slider నెల్లూరు

చంద్రబాబు జన్మదిన సందర్భంగా పేదలకు కూరగాయలు

Nellore TDP

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా 500 కుటుంబాలకు కూరగాయలు, కోడిగ్రుడ్లు పంపిణీ చేయడం అభినందనీయమని నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి అన్నారు.

కోవూరు మండలం పెద్ద పడుగుపాడు మసీదు సెంటర్లో తెలుగుదేశం పార్టీ నాయకులు మహ్మద్, నాసీర్ వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో కూరగాయలు, క్రొడిగ్రుడ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేజర్ల వెంకటేశ్వర రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం చంద్రబాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించేవారమని కరోనా వైరస్ వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఎటువంటి వేడుకలు ఆయన చెప్పడంతో నిరాడంబరంగా చేస్తున్నామని అన్నారు.

ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కరోనా నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న పేదలు కొరకు కోవూరు పట్టణములో 500 మంది పేదలకు ఆహార పొట్లాలు పంపిణీ చేశామని, అదేవిధంగా ఇప్పుడు పెద్ద పడుగుపాడు లో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు 500 కుటుంబాలకు కూరగాయలు, క్రొడిగ్రుడ్ల పంపిణీ చేస్తున్నారని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమం నిర్వహించిన మహ్మద్, నాసర్ వారి మిత్రబృందంకు అదేవిధంగా ఈ కార్యక్రమమునకు చేయూత నిచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు చెంబేటీ పెంచలయ్య, బత్తల రమేష్ ఇతర పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పెనుమల్లి శ్రీహరి రెడ్డి,బత్తల రమేష్, మహ్మద్, నాసీర్, వాహిద్, అబ్దుల్లా, సులేమాన్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనీ

Satyam NEWS

తిరుమలలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి

Bhavani

అనాథ శవాల ఆత్మబంధువుకు అరుదైన గౌరవం

Satyam NEWS

Leave a Comment