తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు రెండు నెలల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టారు. మార్చి 22న హైదరాబాద్ వెళ్లిన చంద్రబాబు లాక్ డౌన్ అమల్లోకి రావడంతో అక్కడే ఉండిపోయారు. లాక్ డౌన్ ఆంక్షలు సడలించడంతో చంద్రబాబు ఎపికి వచ్చారు.
విశాఖపట్నం వెళ్లాల్సి ఉన్నా విమానాలకు రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి అనుమతులు మంజూరు చేయడంతో చంద్రబాబు విశాఖ పర్యటన వాయిదా పడింది. అయితే రోడ్డు మార్గాన హైదరాబాద్ నుండి తాడేపల్లి లో తన నివాసానికి చంద్రబాబు చేరుకున్నారు. ఆయనకు దారిపొడుగునా తెలుగుదేశం శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.