28.7 C
Hyderabad
April 25, 2024 04: 29 AM
Slider చిత్తూరు

మునిరాజమ్మకు చంద్రబాబు రూ.5 లక్షల సాయం

#chandrababu

చిత్తూరు జిల్లాకు చెందిన బలహీన వర్గాల మహిళ మునిరాజమ్మ టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిశారు. కొద్ది రోజుల క్రితం నారా లోకేష్ యువగళం పాదయాత్ర సమయంలో తన బాధలు చెప్పుకున్న మునిరాజమ్మపై, ఆమె హోటల్ పై శ్రీకాళహస్తిలో వైసిపి గూండాలు దాడులకు పాల్పడ్డారు. నాటి దాడి ఘటన వివరాలను, తన కుటుంబాన్ని ఊరు వదిలి వెళ్లమని వైసిపి నేతలు బెదిరించిన విషయాన్ని, వేధింపులను మునిరాజమ్మ…టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు వివరించారు. ఆరోగ్య సమస్యలు ఉన్న పిల్లలతో చిన్న హోటల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న తనపై వైసిపి నేతల దాడిని మునిరాజమ్మ చంద్రబాబు నాయుడు కు వివరించారు. అమె బాధలు విన్న చంద్రబాబు నాయుడు మునిరాజమ్మకు రూ.5 లక్షల రూపాయాల ఆర్థిక సాయం ప్రకటించారు. ధైర్యంగా ఉండాలని అక్రమ కేసులు, వైసిపి బెదిరిపుంలకు భయపడవద్దని..పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు మునిరాజమ్మకు సూచించారు.

Related posts

ఆదర్శ నాయకుడిని అవమానిస్తున్న జగన్ ప్రభుత్వం

Satyam NEWS

సినీ పరిశ్రమ పెద్దలతో మంత్రి తలసాని సమావేశం

Satyam NEWS

ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

Murali Krishna

Leave a Comment