32.2 C
Hyderabad
March 28, 2024 22: 28 PM
Slider విశాఖపట్నం

రాష్ట్రంలో 40వేల కోట్ల భూ దోపిడీ

జగన్ ప్రభుత్వంలోనే రాష్ట్రంలో 40వేల కోట్ల భూ దోపిడీ జరిగిందని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు తీవ్రమైన ఆరోపణలు చేశారు.”ఇదేం ఖర్మ రా” కార్యక్రమంకై ఉత్త రాంధ్ర పర్యటన కు వచ్చిన బాబు… విశాఖ జిల్లా లో పెందుర్తి లో సభ అనంతరం విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో పార్టీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో జగన్ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. ఈ నాలు గేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అవినీతి, అసమర్థత పాలనను లెక్కలతో ఆధారాలతో టీడీపీ అధినేత తూర్పాబెట్టారు. శృంగవరపుకోటలో మాజీ సీఎం చంద్రబాబు ఇంకేం మాట్లారంటే….”నేను ఎక్కడికి వెళ్లినా అన్ని వర్గాల ప్రజలు ఎనలేని ఆదరాభిమానాలు చూపుతున్నారు. వారి ఆదరాభిమానాలు మరువలేనివి టీడీపీకి మద్దతుగా యువత ముందుకు రావడం సంతోషదాయకం.

యువత అంతా కలిసి పేటీఎం తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలి.జగన్ లాంటి సైకోలను అణచివేయాలి. జగన్ అధికారంలోకి వచ్చాక ఇంటి పన్ను పెరిగిందా లేదా? రిజిస్ట్రేషన్ చార్జీలు పెరిగాయా లేదా? బటన్లు నొక్కడంవలన ప్రయోజనం లేదు జగన్ నొక్కేది బటన్ నొక్కుడు కాదు బటన్ బొక్కుడు.పది రూపాయలు ఇచ్చి 100లు లాక్కుంటున్నాడు.

జగన్ ది పేదల ప్రభుత్వం కాదు.. పేదలను దోచే ప్రభుత్వం, ఈ విషయాన్ని ఆడబిడ్డలు ఆలోచించాలి. ఒకప్పుడు ఉల్లిపాయలు కట్ చేస్తే కళ్ళల్లో నీరు వచ్చేవి. నేడు వంటగదిలోకి వెళ్లి గ్యాస్ సిలిండర్ను చూసినా.. నిత్యవసర వస్తువులు చూసినా కళ్ళ నీళ్లు వచ్చే పరిస్థితి ఉంది. అందుకే నేను బాదుడే బాదుడు కార్యక్రమాన్ని ప్రారంభించాను. మీలో చైతన్యం రావాలి.

బుద్ధిలేని ప్రభుత్వానికి బుద్ధి రావడం లేదు. సిగ్గు లేకుండా బాదుడే బాదుడు బాదుతున్నాడు. కరెంటు రేట్లు పెంచాడు.ఇది మోయలేని భారం. 2014 లో కరెంటు కొరత ఉండగా అధిగమించి మిగులు కరెంటు సాధించాం. టీడీపీ హయాంలో ఒక్కసారి కూడా కరెంటు రేట్లు పెంచలేదు. కరెంటు రేట్లు పెంచకుండా మిగులు కరెంటును సాధించాం. సమర్థవంతమైన పాలనను ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది.

ప్రస్తుతం ఎక్కడ చూసినా అవినీతి ఉంది. ఈ ప్రభుత్వంలో దోపిడీ తప్ప ఇంకొకటి లేదు. ఒకపక్క అసమర్థత మరో పక్క అవినీతి. ఇది పేదవారి పట్ల శాపంగా మారింది. ఇది సెంట్రలైజ్డ్ కరప్షన్. బ్రాందీ బాబుల పైన కన్నేసి వారిని దోచుకుంటున్నాడు. ఒకప్పుడు 60 రూపాయలకు లభించే మద్యం మందు బాటిల్ ఇప్పుడు 200 అయిపోయింది. ప్రస్తుతం బూమ్ బూమ్, జే బ్రాండ్లు, హోల్సేల్ డిస్ట్రిబ్యూషన్. అన్ని బ్రాండ్లు జగన్ వే. ఏ షాపులో గాని ఫోన్ పే, గూగుల్ పే, పేటియం లు లేవు. కిరాణా కొట్లు, తోపుడు బండ్లు అన్నింటిలో గూగుల్ పే, ఫోన్ పే లు ఉన్నాయి. మద్యం షాపుల్లో మాత్రం లేకపోవడం ఏమిటి? ఇది చిదంబర రహస్యం. మీరు కట్టే డబ్బుల్లో వాటా తాడేపల్లి ప్యాలెస్ కు చేరుతోంది.

ఉచిత ఇసుక రద్దు చేసి 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేశారు. ఇసుక దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టిడిపి హయాంలో ఇసుక బాగా దొరికేది. ప్రస్తుతం లారీ ఇసుక 70,000 పలుకుతోంది. జిల్లాకు నెలకు 25 వేల కోట్లు 13 జిల్లాలు కలిపి 320 కోట్లు తాడేపల్లి కొంపకు పోతోంది.

పొలం నుంచి మీ ఇంటికి మట్టి రావాలంటే డబ్బు కట్టాల్సిందే. పొలం నీది, మట్టి నీది వాటిపై ముఖ్యమంత్రి పెత్తనం ఏంటి? వైసీపీ మాఫియా పెట్రేగిపోతోంది. అవినీతి, అసమర్థ ప్రభుత్వం ఇది. 45 ఏళ్లుగా నేను రాజకీయాల్లో ఉన్నాను.. రోడ్ షోలు పెట్టాం, రోడ్డులోనే మీటింగులు పెట్టాం, ప్రజల్ని చైతన్యవంతుల్ని చేశాం. ప్రజాస్వామ్య స్ఫూర్తిని తీసుకొచ్చాం. అలాంటిది జీవో నెంబర్ ఒకటి తీసుకొచ్చి ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూశాడు. కోర్టు మొట్టికాయలు వేసింది. ఈ సైకో సీఎం కి భయపడకూడదు.మీటింగులు పెట్టడం మానేయకూడదు.

సాక్షి పక్షి సజ్జల, సజ్జలకు రాజకీయం అంటే తెలియదు.. అటువంటి వ్యక్తి కారుకూతలు కూస్తుంటాడు. ఎమ్మెల్యే కాలేదు అలాంటివాడు ఉపన్యాసాలు ఇస్తున్నాడు, తోక జాడిస్తే కట్ చేస్తా జాగ్రత్త.. ప్రజాస్వామ్యం అంటే తమాషా కాదు. బెదిరించడం కాదు.. సైకోలు బెదిరిస్తే పారిపోకూడదు. ఇలాంటి సైకోలను అణిచివేయాలి.బెదిరిస్తే భయపడడానికి నేను సామాన్యుడిని కాదు.

రెండు రూపాయలకు కేజీ బియ్యం, పక్కా ఇళ్ల నిర్మాణం, అన్నా క్యాంటీన్ లు, విదేశీ విద్య ఏమైంది? చంద్రన్న బీమా ఏమైంది? పెళ్లి కానుక ఏమైంది? సంక్రాంతి కానుక ఏమైంది? వందల సంక్షేమ కార్యక్రమాల్ని రద్దు చేశారు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ పట్టణాల్లో ఒక్కొక్కరికి రెండు సెంట్లు భూమి ఇచ్చింది. ప్రస్తుతం జగన్ ఒక సెంటు ఇస్తానంటున్నాడు. గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇచ్చాం. జగన్ ఇచ్చేది ఒక సెంటు భూమి. ఇల్లు కట్టుకోవాలంటే కనీసం మూడు సెంట్లు భూమి అవసరం. ఇచ్చే ఒక సెంటు సమాధికి సరిపోతుంది. పేదవాడి మీద ప్రేమ ఉంటే మూడు సెంట్లు ఇవ్వాలి.

రాష్ట్రంలో 40 వేల కోట్ల భూదోపిడి జరిగింది. ఇసుక మాఫియా ప్రతి సంవత్సరం పదివేల కోట్లు, రాష్ట్రంలో గంజాయి అమ్మకాలు అధికమయ్యాయి. గంజాయి అమ్మకాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. పేదల జీవితాలను నాశనం చేశాడు. యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదుగానీ గంజాయి మాత్రం ఫుల్ గా ఇస్తున్నాడు. రాష్ట్రంలో మైనింగ్ మాఫియా పెట్రేగిపోతోంది. సిమెంటు మాఫియా తో 12 వేల కోట్లు దోచుకున్నారు. దేశంలో అందరి ముఖ్యమంత్రుల కంటే ధనవంతుడు జగన్… 508 కోట్ల రూపాయల ఆస్తులు అఫీషియల్ గా డిక్లేర్ చేశారు. జగన్ ది రైతు వ్యతిరేక ప్రభుత్వం….” ఇది మన ఖర్మ ప్రభుత్వం” అంటూ చంద్రబాబు తన ప్రసంగాన్ని ముగించారు.

Related posts

కూకట్పల్లి నుండి మహా ధర్నాకు కదిలిన బిజెపి శ్రేణులు

Satyam NEWS

పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత

Satyam NEWS

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరాసింహునికి సాయి కొర్రపాటి భారీ విరాళం

Satyam NEWS

Leave a Comment