39.2 C
Hyderabad
April 25, 2024 18: 14 PM
Slider ప్రత్యేకం

అమరావతి ఆడబిడ్డలు ఈ ఉద్యమానికి ఒక స్పూర్తి

#ChandrababuNaidu

అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని ప్రజలు అంతా పోరాటం చేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు.

ఉద్యమం ప్రారంభం అయి నేటికి 365 రోజులు అయిన సందర్భంగా ఏర్పాటు చేసిన అమరావతి జనభేరి సభలో చంద్రబాబు ప్రసంగించారు.

అధికారం తనకు కొత్త కాదని, ఇప్పుడు అధికారం కోసం ఇలా చేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ప్రజలకు న్యాయం జరగాలి, రైతుల వ్యధను ప్రభుత్వం గుర్తించాలి అని ఆయన కోరారు.

అమరావతి రైతులు ఈ 365 రోజులలో ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపారని, పోలీసులు ఈడ్చేసినా, కేసులు పెట్టినా మహిళలు భయపడలేదని ఆయన అన్నారు.

నేను వెంకన్నను, దుర్గమ్మ ను కోరుకున్నా, అన్యాయం చేస్తే… వెంకన్న ఈ జన్మలోనే వారికి బుద్ధి చెబుతారు అంటూ చంద్రబాబు విమర్శించారు.

రాష్ట్రం లో మనసున్న‌వారంతా ఒక్కసారి ఆలోచించండి అమరావతి రైతులకు సంఘీభావం తెలపాలని ఆయన కోరారు.

Related posts

పటిష్ట నిఘా

Murali Krishna

భక్తుల కోసం మేడారం లో స్టార్ మా తాత్కాలిక గృహాలు

Satyam NEWS

పక్క రాష్ట్రాల వారు వచ్చి అమ్ముకోకుండా చూడండి

Satyam NEWS

Leave a Comment