తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్. చంద్రబాబు నాయుడు ప్రజావ్యతిరేకి అని వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ ఆరోపించారు. అందుకోసమే సీఎం జగన్ మోహన్ రెడ్డి చేపట్టే ప్రతి అభివృద్ధి పని అడ్డుకుంటున్నారని ఆయన అన్నారు. పార్టీ క్యాడర్ జారిపోతుందని భయంతో మహానాడు నిర్వహించారని ఆయన అన్నారు. ఈ ఏడాది కాలంలో ఆయన ఏం చేశారని మహానాడు నిర్వహించారని ద్రోణంరాజు ప్రశ్నించారు.
40 ఏళ్ల అనుభవం అని చెప్పే చంద్రబాబు నిత్యం ప్రభుత్వాన్ని విమర్శించడం మాత్రమే పనిగా పెట్టుకున్నారని మాజీ మంత్రి బాలరాజు అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం రెండు సమానంగా కొనసాగుతున్నాయని ఆయన అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి దూరదృష్టితో కష్టాల్లో కూడా ప్రజలను ఆదుకుంటున్నారని ఆయన తెలిపారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆదివాసుల జీవితాలు మెరుగుపడ్డాయని, వారి అభివృద్ధికి ప్రత్యేకంగా ఎస్టీ కమిషన్ ఏర్పాటు అభినందనీయమని ఆయన అన్నారు. జగన్ మోహన్ రెడ్డి పాలనలో నవరత్నాల ప్రయోజనాలు టిడిపి కార్యకర్తలు, సానుభూతి పరులకు కూడా చేరాయని మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ అన్నారు.