ఈ నెల 21 వ తేదీన మాజీ ముఖ్యమంత్రి,తెలుగుదేశం పార్టీ జాతీయఅధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నట్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లూరి జీవన్ కుమార్ తెలిపారు. . ఈ సందర్భంగా ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ జరుగుతుందని, ఈ సభకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీ గా తరలిరావాలని జీవన్ కుమార్ కోరారు. ఖమ్మం జిల్లా అభివృద్ధి లో తెలుగుదేశం పార్టీ పాత్ర ఎంతో ఉందని, ఖమ్మం నగరం లో జరిగే ఈ సభ ద్వారా జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలం తెలియచేయాలని జీవన్ పిలుపు నిచ్చారు. జిల్లాలోని అనేక మంది నేతలకు టీడీపీ రాజకీయ ఓనమాలు నేర్పి రాష్ట్ర స్థాయి నేతలుగా తీర్చిదిద్దినట్టు గుర్తు చేసారు. తెలుగుదేశం పార్టీ కి ఖమ్మం జిల్లాతో విడదీయారని అనుబంధం వున్నదన్నారు.
previous post