27.7 C
Hyderabad
April 25, 2024 09: 14 AM
Slider ప్రత్యేకం

తోట చంద్రయ్య పాడెను మోసిన చంద్రబాబునాయుడు

#chandrababu

ఫ్యాక్షన్ రాజకీయాలకు బలి అయిపోయిన తెలుగుదేశం పార్టీ నాయకుడు తోట చంద్రయ్య పాడెను టీడీపీ అధినేత చంద్రబాబు మోశారు. నేడు గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చేరుకున్న చంద్రబాబు తోట చంద్రయ్య మృతదేహానికి నివాళి అర్పించారు. చంద్రబాబును చూసి చంద్రయ్య కుటుంబ సభ్యులు బోరున విలపించారు. చంద్రబాబు వెంట మాచర్ల టిడిపి ఇన్-చార్జ్ జూలకంటి బ్రహ్మరెడ్డి, మాజీ మంత్రులు ఆలపాటి రాజా, పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమా,మాజీ ఎమ్మెల్యేలు జి.వి ఆంజనేయులు, యరపతినేని శ్రీనివాసరావు, దూళిపాళ్ల నరేంద్ర, ఇన్-చార్జ్ లు డా౹౹చదలవాడ అరవింద బాబు,కోవెలమూడి రవీంద్ర,నసీర్ పలువురు నేతలు ఉన్నారు. టీడీపీ నేత చంద్రయ్య హత్యను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఖండించారు. ప్రశ్నిస్తున్న వారిని భయపెట్టేందుకే వైసీపీ హత్యాకాండకు పాల్పడుతోందని మండిపడ్డారు. పల్నాడులోనే ఇప్పటికే పదుల సంఖ్యలో రాజకీయ హత్యలు జరిగాయన్నారు. స్థానిక ఎన్నికల టైంలో బోండా ఉమా, బుద్ధాపై దాడి చేశారని అన్నారు. గత దాడుల సమయంలోనే చర్యలు తీసుకుంటే అడ్డుకట్ట పడేదని తెలిపారు. దాడులు చేస్తే పదవులు కట్టబెట్టే విష సంస్కృతిని జగన్‌ చాటుకున్నారని విమర్శించారు. చంద్రయ్య కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. 

Related posts

కరోనా ఎఫెక్ట్: హైదరాబాద్ లో 2480 వాహనాలు సీజ్

Satyam NEWS

రైతు వేదికలకు నిధులు రేపటి లోగా విడుదల చేయాలి

Satyam NEWS

టీడీపీ కుటుంబీకులకు పులివర్తి నాని పరామర్శ

Satyam NEWS

Leave a Comment