మాగంటి బాబు కుటుంబానికి దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు.
బుధవారంనాడు ఆయన ఏలూరులో మాజీ ఎంపీ మాగంటి బాబు కుటుంబాన్ని పరామర్శించారు. మాగంటి బాబు తనయుడు మాగంటి రాంజీ ఇటీవల మరణించిన విషయం తెలిసిందే.
బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చంద్రబాబునాయుడు చేరుకుని అక్కడ నుంచి ఏలూరు వెళ్లారు. మాగంటి బాబు నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
అనంతరం క్రాంతి కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన రాంజీ సంతాప సభకు హాజరయ్యారు. తెలుగు యువత అధ్యక్షుడు రాంజీ మరణం బాధాకరమని ఆయన అన్నారు.
పశ్చిమగోదావరి జిల్లాలో మాగంటి కుటుంబం అనేక సేవలందించిందని, ఈ కష్టకాలంలో మాగంటి కుటుంబానికి అందరూ అండగా ఉండాలని చంద్రబాబు కోరారు.