తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ప్రచారానికి వచ్చిన టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
టీటీడీ అధికారులు చంద్రబాబు కు స్వాగతం పలికి దర్శన ఏర్పాటు చేశారు. చంద్రబాబునాయుడు నేటి నుంచి తిరుపతి లోక్ సభ పరిధిలోని వివిధ అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు.
తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న సందర్భంలో ఆయనతో బాటు టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కె.అచ్చెంనాయుడు, తిరుపతి లోక్ సభ టీడీపీ అభ్యర్ధి పనబాక లక్ష్మి, సీనియర్ నాయకుడు పయ్యావుల కేశవ్ తదితరులు ఉన్నారు.