నాగపూర్ నుండి వరంగల్ ఖమ్మం మీదగా అమరావతి పోవు గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే అలైన్మెంట్ మార్చాలని ఖమ్మంలోని మంత్రి కార్యాలయంలో భూ నిర్వాసితులు రైతు సంఘాల నాయకులు రవాణా శాఖ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ కి వినతిపత్రం అందజేశారు. ఈ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే వల్ల మూడు పంటల పండే వ్యవసాయ భూములు గృహ స్థలాలు కోల్పోవాల్సిన పరిస్థితి ప్రజలకు అవసరం లేని గ్రీన్ ఫీల్డ్ హైవే బలవంతంగా భూములు లాక్కోటానికి ప్రైవేట్ సంస్థలు చేస్తున్నటువంటి కుట్ర అని దీని నుంచి భూభాధితులను కాపాడాలని మంత్రి కి వివరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు దొండపాటి రమేష్, కొండపర్తి గోవిందరావు, తెలంగాణ రైతు సంఘం అధ్యక్షులు మాదినేని రమేష్ బొంతు రాంబాబు, రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి ఆవల వెంకటేశ్వర్లు, భూనిరాస్తుల కమిటీ కన్వీనర్ భద్రయ్య ప్రతాప్ నేను వెంకటేశ్వర్లు భోజట్ల వెంకటయ్య రంగారావు శ్రీధర్ నల్లమోతు శీను బుజ్జ రాధాకృష్ణ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
previous post