భర్త కోల్పోయిన స్త్రీలను వితంతువు అని పేరు పెట్టి ఆసరా పెన్షన్ ఇవ్వడం హేతుబద్ధంగా లేదని విన్నపం ఒక పోరాటం వ్యవస్థాపక అధ్యక్షురాలు లీలావతి చీకూరి అన్నారు. ఈ మేరకు మహిళా కమిషన్ చైర్మన్ వాకిటి సునితా లక్ష్మారెడ్డి కి నేడు ఆమె వినతిపత్రం అందచేశారు. వితంతు,ఒంటరి మహిళ పెన్షన్ గా పిలవడం వలన అవి అందుకుంటున్న మహిళలు ఆత్మస్థైర్యం కోల్పోతున్నారని, ఈ పేర్లను త్వరితగతిన తొలగించి మహిళలకు ధైర్యం కల్పించే పేర్లు పెట్టాలని ఆమె కోరారు. సునీతా లక్ష్మారెడ్డి సానుకూలంగా స్పందిస్తూ ఈ పేర్లను సవరించే అంశం ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకు వెళతారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విజయలక్ష్మి, అనంత పద్మ,ప్రత్యూష,శకుంతల, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.