తిరుమల తిరుపతి దేవస్థానాల బోర్డు మరో కీలక నిర్ణయం తీసుకున్నది. తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శనం వేళల్లో మార్పులు చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం ఉదయం 5 నుంచి 8 గంటల వరకు కొనసాగుతున్న బ్రేక్ దర్శనం వేళలను ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటలకు మార్చనున్నట్లు పేర్కొంది. డిసెంబర్ 1 నుంచి కొత్త వేళలు అమలులోకి వస్తాయి. ఈ నిర్ణయంతో సామాన్య భక్తులకు దర్శనం త్వరగా పూర్తికావడమే కాక గదుల కేటాయింపులపై కూడా ఒత్తిడి తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.
previous post
next post