37.2 C
Hyderabad
March 29, 2024 20: 09 PM
Slider శ్రీకాకుళం

దాతృత్వం చాటుకున్నశ్యాంపిస్టన్స్ కార్మికులు

Viralam

శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం వరిశాం వద్ద గల శ్యాంపిస్టన్స్ ప్లాంట్-2 పరిశ్రమలో పని చేస్తూ ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందిన తోటి కార్మికుడు కోష్ట గ్రామానికి చెందిన కె.నర్సింహమూర్తి కుటుంబాన్నిఆదుకోవడానికి కార్మికులంతా విరాళంగా వసూలు చేసిన తమ ఒక రోజు వేతనం 5,02,950 రూపాయలు ఆర్థిక సహాయాన్నిబుధవారం సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సి.హెచ్ అమ్మన్నాయుడు, శ్యాంపిస్టన్స్ వర్కర్స్ యూనియన్ నాయకులు కె.భోగేష్, ఎస్.వి.రమణ, ఎస్ శివ, జి కిరణ్, చేతుల మీదుగా చనిపోయిన కార్మికుడి కుటుంబ సభ్యులకు అందచేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సిఐటియులో ఉన్న కార్మికులు హక్కుల కోసం, సమస్యలు పరిష్కారం కోసం పోరాటాలే కాకుండా తోటి కార్మిక కుటుంబాలను ఆదుకోవడంలో ముందుంటారని అన్నారు. ఒక్కరోజు వేతనం అందజేసిన కార్మికులకు అభినందనలు తెలియజేశారు. విరాళాన్నిచనిపోయిన కార్మికుడి భార్య కె.రమణమ్మకు అందజేసారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎమ్.తిరుపతిరావు, పి.వి.సూర్యనారాయణ, రమణ, ఎన్.నాగేశ్వరరావు, రామసత్యం తదితరులు పాల్గొన్నారు.

Related posts

అమిత్ షా ను కలసిన ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

Satyam NEWS

క్రిస్టియన్ పేదలకు నిత్యావసరాలు పంచిన టీఆర్ఎస్ నేతలు

Satyam NEWS

బార్ ఓనర్లకు షాక్ ఇచ్చిన జగన్ ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment