నిరుద్యోగులకు టోపీ పెట్టారు.. కాదు కాదు కుచ్చుటోపీ పెట్టారు… ఓ ప్రభుద్దుడు.అదెక్కడో కాదు… విద్యల నగరమైన విజయనగరం లో.నిరుద్యోగుల ఆశలను ఎరగా చేసుకుంది… నగరంలో మండపం వీధిలో ఉన్న రక్షణ డిఫెన్స్ అకాడమీ. నేవీలోనూ ,మిలటరీ లోనూ ఉద్యోగాలు ఇస్తామని… తర్ఫీదుకు యాభై నుంచీ లక్షన్నర వరకు ఫీజు ఉంటుందని అకాడమీ చెప్పడంతో… ఆశగా..ఎదురు చూసే నిరుద్యోగులు..అంత డబ్బులు కట్టడంతో… టిఫిన్, భోజనం కూడా ఉచితంగా నిరుద్యోగులకు పెట్టడంతో నమ్మారు. ఇలా 130 మంది వరకు “రక్షణ డిఫెన్స్ అకాడమీ”కి డబ్బులు చెల్లించారు కూడా.
తీరా ఏ.ఒక్కరికీ ఉపాధి కల్పించకపోగా…అందులో శ్రీకాకుళం కు చెందిన అభ్యర్థి గట్టిగా సంప్రదించడంతో…గుట్టు చప్పుడు కాకుండా ఉడాయించాడు.దీంతో బాధితులంతా సరాసరి టూటౌన్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. ఈ మేరకు సీఐ లక్ష్మణరావు…బాధితుల వద్ద నుంచీ ఫిర్యాదు తీసుకుని 420 అంటే చీటింగ్ కేసు కట్టారు. దీనిపై “సత్యం న్యూస్. నెట్.” ప్రతినిధి తో సదరు టూటౌన్ సీచ లక్ష్మణరావు మాట్లాడుతూ… బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు కట్టామని…నిర్వాహకులు అపస్కాండ్ లో ఉన్నారని… త్వరలో పట్టుకుని బాధితులకు న్యాయం చేకూరుస్తామని చెప్పారు.