ఇటీవల అనారోగ్యంతో మరణించిన ARSI లక్ష్మయ్య కుటుంబ సభ్యులకు శాఖ పరమైన భద్రత ఎక్సిగ్రేషియా నుండి 4 లక్షల రూపాయలు, అదేవిధంగా మహిళ పోలీసు స్టేషన్ లో విధులు నిర్వహిస్తూ… మరణించిన కానిస్టేబుల్ రామచంద్రరావు కుటుంబ సభ్యులకు భద్రత గ్రూప్ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ నుండి 5 లక్షల రూపాయల చెక్కు ను పోలీసు కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ అందజేశారు.
ఈ సందర్భంగా శాఖ పరంగా అందవలసిన బెన్ ఫిట్స్ త్వరితగతిన అందేలా చర్యలు తీసుకొవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడీషనల్ డీసీపీ ఇంజరాపు పూజ, ఏఎస్పీ స్నేహ మేహ్రా , ఏవో అక్తరునీసా బేగం, నర్సమ్మ పాల్గొన్నారు.