ప్రజాస్వామిక ఉద్యమాలే ఊపిరిగా నిరంతరం తెలంగాణ సమాజానికి అండగా నిలబడుతున్న ప్రజల డాక్టర్ చెరుకు సుధాకర్ ను శాసన మండలికి పంపించాలని ములుగు జిల్లా కేంద్రంలో వివిధ పాఠశాల లు,కళాశాలలో ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా యంగ్ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ కూనూరు రంజిత్ గౌడ్,TSU రాష్ట్ర అధ్యక్షులు కృష్ణ మాదిగలు మాట్లాడుతూ తెలంగాణ సమాజమే తన కుటుంబంగా భావించి నాలుగు దశాబ్దాలుగా ఆయన అలుపెరగని పోరాటం చేస్తున్నారని తెలిపారు.
చెరుకు సుధాకర్ ను శాసన మండలికి పంపించాల్సిన బాధ్యత సకలజనుల పై ఉందని వారు అన్నారు. తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమంలో చెరుకు సుధాకర్ పాత్ర ఎనలేనిదని, ఆయనపై అనేక కేసులు పెట్టినప్పటికీ మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం కోసం పోరాటం చేసిన నిస్వార్ధ ఉద్యమకారుడు అని వారన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం అధికారంలోకి వచ్చిన స్వయం పాలకులు అమరుల త్యాగాలను తుంగలోతొక్కి సమైక్య పాలకుల ధోరణి కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సామాజిక ఉద్యమకారుడు విద్యావంతుడు అనునిత్యం ప్రజల కోసం పరితపించే చెరుకు సుధాకర్ ను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో TSU రాష్ట్ర కార్య దర్శులు మహ్మద్ గౌస్,మండ్ల శివకుమార్ పాల్గొన్నారు.