37.2 C
Hyderabad
March 29, 2024 20: 37 PM
Slider ఆదిలాబాద్

గ్రామ గ్రామానా ఛత్రపతి శివాజీ విగ్రహాలు ఏర్పాటు చేద్దాం

#ChatrapatiShivajee

హిందు జాతికి మార్గదర్శకుడు అయిన ఛత్రపతి శివాజీ చూపిన దారిలో నడిచి మన ధర్మాన్ని, సంస్కృతిని, రక్షించుకుందామని బీజేపీ నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మెడిసెమ్మె రాజు పిలుపునిచ్చారు.

నిర్మల్ జిల్లా ముఠాపూర్ గ్రామంలో శుక్రవారం ఉదయం ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ జరిగింది. శివాజీ విగ్రహానికి పూలమాల వేసిన ఆయన మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ విగ్రహాలు గ్రామ గ్రామాన ఏర్పాటు చేస్తామని తెలిపారు.

 మహమ్మదీయుల కబంధ హస్తాల నుండి జాతిని విముక్తి చేసిన హిందు సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ అని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో వడ్ల కొండ ఆలివేలు , బీజేవైయం జిల్లా అధ్యక్షులు ఓడిసెల అర్జున్, హిందువాహిని జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకరి సాయి, గిల్లి విజయ్, గందే రాకేష్ , రజిని, స్వప్న,

అరే శ్రీనివాస్, రవి, మల్లేష్ యాదవ్ , గండ్ల గంగన్న , పోశెట్టి ముఠాపుర్ యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Related posts

మల్టీ నేషనల్ ఛీటింగ్: అమెజాన్ కు పంగనామాలు

Satyam NEWS

కేసీఆర్‌ ముఖంలో కళ ఏది?

Sub Editor

ప్లాస్టిక్ భూతంపై నింజా మీడియా పోరాటం

Satyam NEWS

Leave a Comment