28.7 C
Hyderabad
April 25, 2024 06: 17 AM
Slider చిత్తూరు

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు తిరుమలలో ఘన స్వాగతం

#CJI

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా పదవి చేపట్టిన ఎన్.వి రమణ నేడు తిరుపతి వచ్చారు.

శ్రీవారి దర్శనార్థం గురువారం రాత్రి తిరుమలకు చేరుకున్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి రమణకు  శ్రీ పద్మావతి అతిథి గృహం వద్ద  టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి,ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో ఎవి ధర్మారెడ్డి స్వాగతం పలికారు.

అనంతరం  శ్రీవారి దర్శనం కోసం ఆలయ మహా ద్వారం వద్దకు చేరుకున్న జస్టిస్ రమణకు  చైర్మన్, ఈవో, అదనపు ఈవో స్వాగతం పలికారు.

జస్టిస్ ఎన్వీ రమణ సతీ సమేతంగా స్వామివారి ఏకాంత సేవలో పాల్గొన్నారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లలిత కుమారి, జిల్లా ప్రధాన న్యాయ మూర్తి రవీంద్ర బాబు, తిరుపతి అదనపు జిల్లా జడ్జి వై.వీర్రాజు, ప్రోటో కాల్ మేజిస్ట్రేట్ పవన్ కుమార్, డిఐజి క్రాంతి రాణా టాటా, సి వి ఎస్ ఓ గోపీనాథ్ జెట్టి, జిల్లా కలెక్టర్ యం. హరి నారాయణన్,తిరుపతి అర్బన్ ఎస్.పి వెంకట అప్పల నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related posts

కోటప్పకొండ తిరుణాళ్లకు పోలీసు ఏర్పాట్లు పూర్తి

Bhavani

ఎన్.సి.ఎల్.పి ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి

Satyam NEWS

రియాక్షన్: అయ్యో దోచుకుందామనుకుంటే ఇలా అయిందే

Satyam NEWS

Leave a Comment