తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్ వి రమణ పేరును సిఫార్సు చేస్తూ ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ బాబ్డే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.
ప్రస్తుతం జస్టిస్ ఎన్ వి రమణ సుప్రీంకోర్టు న్యాయమూర్తులలో అత్యంత సీనియర్.
48వ భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమించేందుకు జస్టిస్ ఎన్ వి రమణ పేరును సిఫార్సు చేస్తూ చీఫ్ జస్టిస్ బాబ్డీ నేడు కేంద్ర న్యాయ శాఖకు లేఖ రాశారు.
ఏప్రిల్ 23న చీఫ్ జస్టిస్ బాబ్డే పదవీ విరమణ చేయనున్నారు.