ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 23న తిరుమలకు వెళ్లనున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా రెండు రోజుల పాటు ఆయన తిరుమలలోనే బసచేస్తారు. సీఎం జగన్ తో పాటు కర్ణాటక సీఎం యడ్యూరప్ప కూడా తిరుమల కు రానున్నారు.
గరుడసేవ సందర్భంగా సీఎం జగన్ శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. 24న ఉదయం ఆయన శ్రీవారిని దర్శించుకుంటారు. స్వామి దర్శనం తర్వాత సుందరకాండ పారాయణంలో పాల్గొంటారు. అదే విధంగా సీఎం జగన్ , సీఎం యడ్యూరప్ప కర్ణాటక అతిధి గృహం శంకుస్థాపన లో పాల్గొంటారు.