ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని రామప్ప దేవాలయాన్ని శనివారం తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్మాస్టర్ ఎస్ రాజేంద్ర కుమార్ సందర్శించారు.
ఆలయ అర్చకులు హరీష్ శర్మ, ఉమా శంకర్ లు ఆయనకు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు జరిపించారు.
ఒక చరిత్ర శిల్ప కల గొప్పతనం గురించి టూరిజం గైడ్ ద్వారా తెలుసుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ రామప్ప శిల్పాలు అద్భుతంగా ఉన్నాయని యునెస్కో గుర్తింపు పొందిన సందర్భంగా దేవాలయాన్ని చూడడానికి వచ్చినట్లు ఆయన తెలిపారు.
ఆయన వెంట హన్మ కొండ డివిజన్ ఎస్పీ నంద, ఏ ఎస్పీ ప్రసాద్, ఏ ఎస్ ఓ కిరణ్, ఐ పీ ఓ శంకర్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సురేందర్ తదితరులు వున్నారు.